నెల్లూరు నగరంలో హోరెత్తిన జై భీమ్ నినాదాలు
ఆకట్టుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటం
ఘనంగా సమతా ర్యాలీ..
- నెల్లూరు నగరంలో హోరెత్తిన జై భీమ్ నినాదాలు
- ఆకట్టుకున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని… సింహపురి చైతన్య వేదిక, నెల్లూరు బహుజన యూత్ సంయుక్త ఆధ్వర్యంలో సమతా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగరం వీఆర్సీ మైదానం నుంచి ట్రంకు రోడ్డు, కనకమహాల్ సెంటర్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలకరించి నగరంలో ఊరేగించారు. జై భీమ్…జై భీమ్ నినాదాలు…డీజే అంబేద్కర్ గీతాలతో నగరం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా సింహపురి చైతన్య వేదిక నాయకులు అమృత్ కుమార్, బాబీ భగత్ లు మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా సమతా ర్యాలీని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు చెందిన సింహపురి చైతన్య వేదిక, నెల్లూరు బహుజన యూత్ నాయకులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.