ఎంపీపీ చింతారెడ్డి పద్మావతి
సీతారామపురంలో రూ. 35 లక్షలతో సీసీ రోడ్లు, అరుగుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీపీ
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా
- ఎంపీపీ చింతారెడ్డి పద్మావతి
- సీతారామపురంలో రూ. 35 లక్షలతో సీసీ రోడ్లు, అరుగుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీపీ
గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అన్నారు. సీతారామపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో 35లక్షలతో సీసీ రోడ్లు,రచ్చబండ అరుగుల నిర్మాణ పనులకు ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎంపిపీ మాట్లాడుతూ… మండలంలోని 14 పంచాయతీల పరిధిలో జనరల్ ఫండ్ నిధులు 2.20 కోట్లు రావడం సంతోషంగా ఉందన్నారు. అందులో బాగంగా 35 లక్షలతో పలు గ్రామాల్లో సీసిరోడ్లు, రచ్చబండ అరుగులు నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.మండలంలోని ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. త్రాగునీరు,పారిశుధ్యం,రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు త్వరితగతిన నాన్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటునట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అద్యక్షుడు చింతంరెడ్డి సుబ్బారెడ్డి,వెంకటరెడ్డి, బ్రహ్మయ్య,బాలినేని మాబయ్య,సర్పంచ్ దుగ్గయ్య,తదితరులు పాల్గొన్నారు.