ఈదురు గాలులు బీభత్సం..

కావలి డివిజన్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం

కారు మబ్బులు అలుముకొని, ఆ వెంటనే వీచిన బలమైన ఈదురు గాలులు

వాకర్స్ ను, తిరిగే పాదచారులు చుట్టుముట్టిన దుమ్ముధూళీ. బెంబేలెత్తిన జనం

ఈదురు గాలులు బీభత్సం..

  • కావలి డివిజన్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం
  • కారు మబ్బులు అలుముకొని, ఆ వెంటనే వీచిన బలమైన ఈదురు గాలులు
  • వాకర్స్ ను, తిరిగే పాదచారులు చుట్టుముట్టిన దుమ్ముధూళీ. బెంబేలెత్తిన జనం

కావలి పట్టణంతోపాటు డివిజన్ లోని అన్నీ మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు జనాన్ని బెంబేలెత్తించాయి. ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కారుమబ్బులు అలుముకున్నాయి. ఆ వెంటనే బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆదివారం కావడంతో మైదానంలో ఆడుకునే పిల్లలు, వాకర్స్, ఆరుబయట తిరిగే జనాలను గాలుల దాటికి దుమ్ము ధూళి చుట్టుముట్టి హడలెత్తించింది. మరోపక్క కావలి పట్టణంలో కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలు ఊగుతూ ఎప్పుడూ పడిపోతాయోనన్న భయాందోళన నెలకుంది. పట్టణంలో శాంతినగర్ లోని చాట్లవారి వీధి ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభం ఉన్నా విద్యుత్ అధికారులు పట్టించుకోలేదని వారు వాపోయారు. కొండాపురం మండలం రామానుజాపురంలో గాలులకు వేపచెట్టు కొమ్మ రేకులపై పడి వృద్ధు రాలికి గాయాలు అయ్యాయి. పట్టణంలో పలు ప్రాంతాలలో కట్టిన ఫ్లెక్సీలు పడిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *