పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించిన సీఐ, ఎస్ఐలు
సూళ్లూరుపేటలో అర్ధరాత్రి పోలీసుల గస్తీ
- పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించిన సీఐ, ఎస్ఐలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పోలీస్ నిఘాను కట్టుదిట్టం చేశారు. సీఐ మురళీకృష్ణ, ఎస్సై బ్రహ్మనాయుడు, శ్రీహరికోట ఎస్సై శ్రీకాంత్ శనివారం రాత్రి 10 గంటల తర్వాత పోలీస్ సిబ్బందితో కలిసి ప్రజల భద్రత కోసం రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేశారు. బైకులపైన కారణం లేకుండా తిరగకూడదని నిబంధన పెట్టారు. పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలోని అన్ని దుకాణాలు మూసివేయించడంతో పాటు రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను ఆపి వారి వివరాలు తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ఎటువంటి కారణం లేకుండా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. అలాగే అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిస్తామని సీఐ మురళీకృష్ణ తెలిపారు.