సిలోయం బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో వేడుకలు
క్రీస్తు జీతాలు ఆలపిస్తూ ముత్తుకూరులో ర్యాలీ
ముత్తుకూరు లో ఘనంగా మట్టల ఆదివారం.
సిలోయం బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో వేడుకలు.
క్రీస్తు జీతాలు ఆలపిస్తూ ముత్తుకూరులో ర్యాలీ.
నెల్లూరు జిల్లా… ముత్తుకూరు మండల కేంద్రంలోనీ సిలోయం బాప్టిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ముత్తుకూరు ప్రధాన వీధులలో క్రైస్తవులు పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. ముందుగా సిలోయం బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో సంఘ స్థాపకులు బూదూరు అబ్రహం ప్రార్థనలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా చర్చి పాస్టర్ కొఠారూ టెర్తులియన్ పాల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈ మట్టల ఆదివారం వేడుకలను నిర్వహిస్తుంటారని చెప్పారు. ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు రాజుగా ఆయనను ఆహ్వానించేందుకు ఈ వేడుకలను జరుపుకున్నారని పాస్టర్ టెర్తులియన్ పాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గున్నం ప్రసూన,చర్చి సెక్రటరీ బూదురు బాలు విన్సెంట్, సభ్యులు విజయవర్ధన్, ప్రవీణ్ కుమార్, నజరేత్, దాసు, రితేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.