నేటి వార్త మాలిక‌

47 మంది లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందచేసిన మంత్రి ఆనం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలోనే ఐదో స్థానం సాధించిన నెల్లూరు జిల్లా

ఎన్ 3 న్యూస్ కథానికి స్పందించిన అధికారులు

ఎమ్మెల్యే ఆదేశాలతో రూరల్ నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు

భక్తజన సందోహంతో నిండిపోయిన కాణిపాకం

నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన 47 మంది లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పంపిణీ చేశారు. మీడియా సమావేశంలో గత వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు.

ఇంటర్మీడియల్ ఫలితాల్లో నెల్లూరులోని కృష్ణచైతన్య విద్యా సంస్థ విజయదుందుభి మోగించింది. కళాశాల బయట పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని డైరెక్టర్లు, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.

ఎన్ 3 న్యూస్ లో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించారు. కలువాయిలో ఇసుక అక్రమ రవాణాపై అధికారులు జూలు విధించారు. భారీ టిప్పర్లను అధికారులు సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో వివేకానంద జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. అన్నీ గ్రూప్ లలో తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల కరస్పాండెంట్ రాధాకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

కావలి పట్టణంలోని 25 వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేపట్టారు. అనంతరం ఆయన వార్డులో చిరువ్యాపారులు, స్థానికులతో మాట్లాడి వారి వ్యక్తిగత, వార్డులో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఉత్తమ మార్కుల్ని సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల చైర్మన్, డైరెక్టర్, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు.

కోవూరు మండలం పాటూరులో మద్యం షాపు వద్దంటూ మహిళలు నిరసనకు దిగారు. ఎక్సైజ్ అధికారికి వినతి పత్రం అందచేశారు. మద్యం షాపును వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు

ఇసుకాసురుల కారణంగానే…కలువాయిలోని నూకనపల్లి వద్ద బ్రిడ్జి కుంగిపోయిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలు, వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఉన్నతాధికారులు పట్టించుకొని వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు మూడు రోజులు వరుస సెలవులు రావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో దేవాలయానికి త‌ర‌లివ‌చ్చారు

ముత్తుకూరు మండలం పైనాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణాన్ని కొందరు ఉద్దేశ్వపూర్వకంగా అడ్డుకున్నారని గ్రామస్థులు వాపోయారు. నిర్మాణానికి అధికారులు సహకరించాలని వారు తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందచేశారు.

అభివృద్ధిలో భాగంగా…నెల్లూరురూరల్ నియోజకవర్గంలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ శర వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పొదలకూరు రోడ్డులోని ESI hospital ప్రక్కన గల “పెద్దల కొలువును కార్పొరేషన్ అధికారులు కూల్చి వేశారు.

బుచ్చిరెడ్డిపాళెంలో కోదండరాముడి బ్రహ్మోత్సవాతలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాముడి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తులు విశేషంగా పాల్గొని రథోత్సవాన్ని తిలకించి తరించారు.

విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం కాపులు, గ్రామస్థులు మీడియా సమావేశం నిర్వహించారు. కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేకే మహిళ బలవన్మరణం ఘటనలో ఆ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశామని చెప్పారు.

గూడూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల టీ షర్టులను ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆవిష్కరించారు. అంబేడ్కర్ జ‌యంతికి క్రికెట్ పోటీలు నిర్వహించ‌డం అభినంద‌నీయమని నిర్వాహకుల్ని ఆయన కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *