అన్నీ గ్రూప్ లలో ప్రతిభ చాటిన విద్యార్థినీ విద్యార్థులు
విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని అభినందించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు
ఇంటర్ ఫలితాల్లో విశ్వసాయి ప్రభంజనం…
- అన్నీ గ్రూప్ లలో ప్రతిభ చాటిన విద్యార్థినీ విద్యార్థులు
- విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని అభినందించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు
శనివారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో విశ్వసాయి జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. అన్నీ గ్రూప్ ల్లోనూ విద్యార్థులు అత్యత్తుమ మార్కులు సాధించి మరో సారి తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా నెల్లూరులోని కళాశాల ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ కృష్ణ మోహన్, చైర్ పర్సన్ రుక్మిణి, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించి బొకేలు అందచేశారు. అనంతరం చైర్మన్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ… 5 స్టెప్ ప్రోగ్రామ్, ఒత్తిడి లేని బోధన, ప్రణాళికా యుతమైన విధానాలు పాటించడం వలనే తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించగలిగారన్నారు. ఇంతటి విజయానికి కారకులైన అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.