పెంచిన గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించాలి

ఉద‌య‌గిరి త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న‌

కూట‌మి ప్ర‌భుత్వం మాట త‌ప్పింద‌న్న సీపీఎం నేత కాకు వెంక‌ట‌య్య‌

పెంచిన గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించాలి

  • ఉద‌య‌గిరి త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న‌
  • కూట‌మి ప్ర‌భుత్వం మాట త‌ప్పింద‌న్న సీపీఎం నేత కాకు వెంక‌ట‌య్య‌

నెల్లూరు జిల్లా ఉదయగిరి తహ‌సిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ సభ్యులు, నాయకుడు కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రజలపై ఇప్పుడు లేని విధంగా ఒకేసారి 50 రూపాయలు గ్యాస్ ధర పెంచడం అన్యాయమన్నారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలు అనుగుణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిప‌డ్డారు. ఇప్పుడు పెంచిన ఈ గ్యాస్ ధర పుండు మీద కారం చల్లినట్టు ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఇలా ప్రజలపై పెను భారం మోపడం అన్యాయమ‌ని చెప్పారు. పెంచిన గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గించాలని లేకపోతే ఈ ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *