ప్రగతి నగర్ లోని ఎలీప్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను సందర్శించిన బృందం
తెలంగాణాలో మంత్రి నారాయణ బృందం
- ప్రగతి నగర్ లోని ఎలీప్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను సందర్శించిన బృందం
తెలంగాణాలో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ బృందం పర్యటించింది. ప్రగతి నగర్ లో ఎలీప్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను మంత్రి బృందం పరిశీలించింది. స్టార్టప్ కంపెనీలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో టిడ్కో ఇళ్లలో నివసించే మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు MSME యూనిట్లు మున్సిపల్ శాఖ నెలకొల్పనున్నట్లు మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది మెప్మా ద్వారా పట్టణప్రాంతాల్లో 30 వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారుచేయాలన్నదే తమ లక్ష్యమని నారాయణ స్పష్టం చేశారు.