రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
పూలే దంపతుల విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి, కలెక్టర్, జేసీ
పూలే ఐలాండ్ ను మరింత అభివృద్ధి చేస్తాం
- రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- పూలే దంపతుల విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి, కలెక్టర్, జేసీ
నెల్లూరు నగరంలోని పూలే ఐలాండ్ ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. సావిత్రి భాయ్ పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని పూలే దంపతుల విగ్రహాలకు ఆయన..కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ…బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి, భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని ప్రశంసించారు. పూలే ఆశయ సాధనే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.