ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేద్దాం
గౌరవం తగ్గకుండా చూసుకుంటా
వైసీపీని వీడిన టీడీపీ తీర్ధం పుచ్చుకున్న నాయకులు
టీడీపీలోకి ఆహ్వానించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కార్యకర్త బాగుంటే…నాయకుడు బాగుంటాడు
- ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేద్దాం
- గౌరవం తగ్గకుండా చూసుకుంటా
- వైసీపీని వీడిన టీడీపీ తీర్ధం పుచ్చుకున్న నాయకులు
- టీడీపీలోకి ఆహ్వానించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కష్టకాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వారి ఆకాంక్షలకు, గౌరవం తగ్గకుండా చూసుకుంటానని..
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 31వ డివిజన్,అక్కచెరువుపాడుకు చెందిన వైసీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, పద్మనాభ రెడ్డి వారి మిత్రబృందం ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. నా దృష్టిలో కార్యకర్త బాగుంటే ఆ నాయకుడు బాగుంటాడని…ఆ పార్టీ బాగుంటుందని మనసా వాచా నమ్ముతానన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.