ఆనం కాంస్య విగ్రహం ఏర్పాటు నిర్ణయం హర్షణీయం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు కేతంరెడ్డి
ఆనం వారసుడిగా నేను పీహెచ్డీ..శ్రీధరన్న డాక్టరేట్
- ఆనం కాంస్య విగ్రహం ఏర్పాటు నిర్ణయం హర్షణీయం
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు కేతంరెడ్డి
నెల్లూరు ముద్దుబిడ్డ ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆనం శిష్యులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. ఆనం శిష్యవర్గంతో కలిసి కేతంరెడ్డి వినోద్రెడ్డి.. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీధర్రెడ్డిని ప్రత్యేకంగా సత్కరించారు. కాంస్య విగ్రహం ఏర్పాటు నిర్ణయంపై ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆనం రాజకీయాలను ఒంటబట్టించుకున్న వ్యక్తి శ్రీధర్రెడ్డి అని, మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవలో చిరస్థాయిగా నిలిచిపోతున్నారన్నారు. ఆనం వారసుడిగా తాను పీహెచ్డీ చేస్తే.. శ్రీధర్రెడ్డి డాక్టరేట్ పొందారన్నారు. కార్యక్రమంలో.. మలేపాటి చైతన్య, మాధవ్ రెడ్డి, బర్నాబాసు, మేఘనాథ్ సింగ్, నారాయణ రెడ్డి, అలహరి విజయ్, ఖాదర్ బాషా, పేరా రెడ్డి, హనుమంత రావు, ముజీబ్, షామీమ్, ఆనంద్, లయన్స్ క్లబ్ ప్రముఖులు మరియు ఆనం వివేకానంద రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.