ఎస్బీఐ ఉద్యోగాల పేరుతో భారీ దోపిడి
అమాయకులవద్ద సుమారు రూ.5కోట్లు నొక్కుడు
న్యాయం కోసం ఎన్-3ని ఆశ్రయించిన బాధితులు
అమ్మడు.. కోట్లు కుమ్ముడు..!!
-ఎస్బీఐ ఉద్యోగాల పేరుతో భారీ దోపిడి
-అమాయకులవద్ద సుమారు రూ.5కోట్లు నొక్కుడు
న్యాయం కోసం ఎన్-3ని ఆశ్రయించిన బాధితులు
అందంగా ఉంటుంది.. అంతకుమించి ప్రొఫిషనల్గా కనిపిస్తోంది.. హై ఫై ప్రొఫైల్ మెయింటింగ్ చేస్తుంది.. డ్రస్కోడ్.. మెడలో ఐడీ కార్డు.. చేతిలో రెండు సెల్ ఫోన్లు.. తనతోపాటు ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు.. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ.. ఎదుటివారిని ఇట్టే నమ్మించేస్తుంది. ఆమె తీరును చూసినవాళ్లెవరైనా.. అబ్బో.. పెద్ద సంగతేనని భ్రమపడాల్సిందే. నమ్మకంగా గొంతు కోసేస్తుందని ఎవరూ పసిగట్టరు. అమాయకులనైతే.. నమ్మించి.. కోట్లు కొల్లగొట్టేస్తుందని అస్సలు ఊహించరు.. ఇలా.. తన అందం.. చందం.. మాటతీరుతో నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు అమాయక నిరుద్యోగులను నమ్మించి.. నట్టేట ముంచేసిందీ వగలాడి. ఎస్బీఐలో ఉన్నత ఉద్యోగాలిప్పిస్తానంటూ.. సుమారు ఐదుకోట్ల రూపాయిలను నిలువునా దోచేసింది ఆ మోసకారి.. ఆమె చేతిలో దారుణంగా మోసపోయిన బాధితులు తమకు న్యాయం జరుగుతుందని.. ఎన్-3ని ఆశ్రయించిన వైనం ఇది.
ఉన్నత చదువులు చదువుకుని.. మంచి ఉద్యోగాల వేటలో ఉన్న అమాయకులే ఆమె టార్గెట్…. లక్షలు చెల్లిస్తే SBI లో మేనేజర్ స్థాయి పోస్ట్ అంటూ…ఆశ చూపడం ఆమె అస్త్రం…ఆ మాయ లేడీ మాటలు నమ్మి.. అకౌంట్లో డబ్బులు వేసిన వారికి ఉద్యోగం మాత్రం రాదు కానీ….అపాయింట్మెంట్ లెటర్లు… ఐడి కార్డులు…టెలీకాన్ఫెరెన్స్ కాల్స్ కూడా వస్తాయి…ఇలా నమ్మి మోసపోయినవారంతా.. పోలీసులను ఆశ్రయించినా.. ప్రయోజనం లేకపోయింది. చివరకు ఆ మోసగత్తె అందానికి.. ఆమె విసిరిన వలకు కొందరు పోలీసులు కూడా పడిపోయారని.. అందుకే ఆమెపై కేసు నమోదు చేయడంగాని.. చర్యలు తీసుకోవడంగాని చేయడంలేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. తమ సమస్యను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు…డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్….హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లాలని N3 NEWS ని ఆశ్రయించారు.