కూటమికి ఎలాంటి సంబంధం లేదు
కలెక్టర్ను కలిసింది మాత్రం వాస్తవమే
వెంకటగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ కులుకుల రాజేశ్వరరావు
కలెక్టర్ను కలిసింది మాత్రం వాస్తవమే
- వైసీపీలోని రెండు వర్గాల్లో పొత్తులు పోకనే అవిశ్వాస తీర్మానం
- ఏఎంసీ మాజీ చైర్మన్ కులుకుల రాజేశ్వరరావు
తిరుపతి జిల్లా వెంకటగిరిలో కూటమి సీనియర్ నాయకులు టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకులు రాజేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం మాట్లాడుతూ నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వైసీపీలోనే రెండు వర్గాలుగా ఏర్పడి పొత్తులు పోక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనుల కోసం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కలెక్టర్ను కలిసింది వాస్తవమేనని చెప్పారు. అయితే అవిశ్వాసం వాయిదా వేయడానికి కలెక్టర్ కలిశారని వైసీపీ వాళ్లు చేస్తున్న ప్రచారం అవాస్తమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ కౌన్సిలర్ పులికొల్లు విశ్వనాథం, టిడిపి పట్టణ మాజీ అధ్యక్షుడు మంకు ఆనంద్, వెంకటసుబ్బయ్య, జనసేన నాయకులు జంపాల ప్రకాష్, రామారావు అనిల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.