పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

సీపీఎం నేతలు డిమాండ్

నెల్లూరు నగరంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా

పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి…

  • మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి
  • సీపీఎం నేతలు డిమాండ్
  • నెల్లూరు నగరంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
  • అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా

పెంచిన వంట గ్యాస్, డీజల్, పెట్రోల్ ధరలకు నిరసనగా…భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నెల్లూరు నగర, రూరల్ కమిటీల ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి వి ఆర్ సి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యధిక పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని అన్నారు. వచ్చే జీతాలు వేతనాలతో కుటుంబ అవసరాలు తీరక ప్రజలు అల్లాడుతుంటే ఇప్పుడు అదనంగా గ్యాస్ పై 50 రూపాయల పెంచడం సరియైన చర్య కాదన్నారు. తక్షణమే 50 రూపాయల పెంపుదలను రద్దుచేసి ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇతర రాష్ట్రాల కన్నా తక్కువగా ఉండే విధంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ విధానాల తీరుమారకపోతే ప్రజా ఉద్యమాలు పోరాటాలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ బి, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి నాగేశ్వరరావు, కే పెంచల నరసయ్య, అబ్దుల్ అజీజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *