సీతారామపురంలో షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
రూ. లక్షల ఆస్తి నష్టం
సర్వం కోల్పోయాం…
- మిగిలిన కట్టుబట్టలు
- సీతారామపురంలో షార్ట్సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
- రూ. లక్షల ఆస్తి నష్టం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సీతారామపురం మండల కేంద్రంలోని స్ధానిక రాజుగారి కాలనీ సమీపంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్ సర్క్యూట్తో సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం చుట్టుముట్టాయి. క్షణాల వ్యవధిలో ఇల్లు మొత్తం దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు,తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. గ్రామస్థులు గమనించి నీటితో మంటలను చల్లార్చారు. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోవడంతో బాధిత చిన్నారులు కట్టుబట్టలతో మిగిలారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తండ్రి ఆనారోగ్య కారణంగా పామురులో ఉన్నాడని… తల్లి ఉపాధి కోసం తిరుపతిలో ఉందన్నారు. ఈ క్రమంలో తాము ఇంట్లో ఉంటూ చదుకుంటున్నామన్నారు. రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తాము సర్వం కోల్పోయీ కట్టబట్టలతో మిగిలామన్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరారు.