అరుదైన బొంబే ఫెనో టైప్ రక్తదానంతో 33 మందికి ప్రాణం
అత్యవసర సమయంలో నోవా బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేసిన మధుసూదన్రెడ్డి
రక్తదాత ఇప్పగుంట సేవలను కొనియాడిన డాక్టర్ మోపూరు భాస్కర్నాయుడు
లక్షల్లో ఒకరు… ఇప్పగుంట మధుసూదన్రెడ్డి
- అరుదైన బొంబే ఫెనో టైప్ రక్తదానంతో 33 మందికి ప్రాణం
- అత్యవసర సమయంలో నోవా బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేసిన మధుసూదన్రెడ్డి
- రక్తదాత ఇప్పగుంట సేవలను కొనియాడిన డాక్టర్ మోపూరు భాస్కర్నాయుడు
అరుదైన బొంబే ఫెనో టైప్ బ్లడ్ కలిగిన లక్షల్లో ఒకరు ఇప్పగుంట మధుసూదన్రెడ్డి అని, అతను ఇప్పటివరకు 33 మందికి ప్రాణదానం చేయడం గొప్ప విషయమని నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మోపూరు భాస్కర్నాయుడు కొనియాడారు. నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్లో మధుసూదన్రెడ్డి 33వ సారి అత్యవసర సమయంలో రక్తదానం చేశారు. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి రేర్ గ్రూప్ అయిన బొంబే ఫెనో టైప్ బ్లడ్ అవసరమైంది. దీంతో వారి కుటుంబ సభ్యులు అన్నీ ప్రాంతాల్లో అడిగి చూశారు. ఎక్కడ లభ్యం కాకపోవడంతో వారు నెల్లూరులోని నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ మోపూరు భాస్కర్నాయుడును సంప్రదించారు. దీంతో భాస్కర్నాయుడు ఆ అరుదైన రక్త గ్రూప్ కలిగిన బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఇప్పగుంట మధుసూధన్రెడ్డిని అడగ్గా… అతను ముందుకొచ్చి రక్తదానం చేసి ఓ ప్రాణాన్ని నిలబెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ మోపూరు భాస్కర్నాయుడు మాట్లాడుతూ కృష్ణచైతన్య విద్యాసంస్థల్లో ఓ చిరుఉద్యోగి అయిన ఇప్పగుంట మధుసూదన్రెడ్డి అరుదైన బొంబే ఫెనో టైప్ రక్త గ్రూప్ కలిగిన వ్యక్తి అని, ఇప్పటివరకు 33 మందికి అతను అత్యవసర సమయంలో ప్రాణదానం చేశారని కొనియాడారు. అనంతరం రక్తదాత మధుసూదన్రెడ్డి మాట్లాడారు. తనవంతుగా సమాజసేవ చేసేందుకు అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.