బాలాయపల్లి మండలం కోటంబేడుకు చెందిన తాటి వెంకటరమణయ్య కేసును ఛేదించిన పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెళ్లడించిన వెంకటగిరి సీఐ ఏవి రమణ
ప్రమాదవశాత్తు నాటుతుపాకీ పేలి మృతి
-బాలాయపల్లి మండలం కోటంబేడుకు చెందిన తాటి వెంకటరమణయ్య మృతి
కేసును ఛేదించిన పోలీసులు
-మీడియా సమావేశంలో వివరాలు వెళ్లడించిన వెంకటగిరి సీఐ ఏవి రమణ
గత కొద్ది రోజులక్రితం వెంకటగిరి నియోజకవర్గం.. బాలాయపల్లి మండలం కోటంబేడు చెందిన 55 ఏళ్ల తాటి వెంకట రమణయ్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంపై అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తిరుపతి జిల్లా ఎస్పీ, గూడూరు డీఎస్పీల ఆదేశాల మేరకు వెంకటగిరి పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోజీల మండలం.. రావిపాడుకు చెందిన కొండ శివయ్య అనే వ్యక్తితోపాటు మృతుడు వెంకటరమణయ్య వేటకు వెళ్లాడని.. వేటాడే క్రమంలో ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి.. వెంకటరమణయ్య మృతిచెందినట్లు నిర్థారించారు. అనుమానితుడు శివయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో అసలు విషయం వెళ్లడించాడు శివయ్య. ఆ సమయంలో మృతదేహాన్ని అక్కడి తెలుగు గంగ కాలువలో పడేసి.. వెళ్లిపోయినట్లు నేరం ఒప్పుకోవడంతో.. అతడ్ని వెంకటగిరి సీఐ రమణ ఆధ్వర్యంలో అరెస్టు చేసి.. మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఆయా వివరాలను సీఐ రమణ వివరించారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన బాలాయపల్లి ఎస్సై కె. గోపి, సిబ్బందికి సీఐ అభినందించారు.