సంక్షిప్త వార్తా మాలిక ఎన్‌3 న్యూస్ బుల్లెట్స్‌

పెద్దపట్టపుపాళెం శ్రీరానవమి వేడుకల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

పెంచలకోనలో శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభివంగా శ్రీరామనవమి వేడుకలు

అభివృద్ధే ధ్యేయంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కృషి

కుప్పం కొత్తపేటలో శ్రీ పెద్దపల్లి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభం

వింజమూరు మండలం మోట చింతలపాళెంలో అగ్ని ప్రమాదం

ఘనంగాబీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చొరవతోనే రైతులకి మేలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా క్రైస్తవ సోదరులు ర్యాలీ

శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

పెద్దపట్టపుపాళెంలో జరిగిన శ్రీరానవమి వేడుకల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీతారాముల వారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

రాపూరులోని పెంచలకోనలో శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభివంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తరించారు.

మారుమూల అభివృద్ధే ధ్యేయంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు. బుచ్చి మండలం నాగమాంబాపురంలోని గిరిజన కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామన్నారు.

కుప్పం కొత్తపేటలో శ్రీ పెద్దపల్లి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

వింజమూరు మండలం మోట చింతలపాళెంలో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు రూ. 7 లక్షల విలువ చేసే మామిడి తోట దగ్ధమైంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని తోట యజమాని దొరసానమ్మ వేడుకుంది.

వాకాడులో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీ వరప్రసాద్ రావు ముఖ్య అతిధిగా పాల్గొని బీజేపీ జెండాను ఆవిష్కరించారు

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చొరవతోనే రైతులకి మేలు జరిగిందని కొడవలూరు, విడవలూరు రైతులు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే పంట కూడా ఇదే విధంగా సహకరించి రైతుల్ని ఆదుకోవాలని వారు కోరారు.

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా…కోవూరులో క్రైస్తవ సోదరులు ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ మృతిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

నెల్లూరు నగరంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సీతారాముల వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షింగా ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *