మారుమూల అభివృద్ధే ధ్యేయంగా కోవూరు ఎమ్మెల్యే కృషి
ఎన్నో ఏళ్లుగా ఉన్న మట్టి రోడ్లు, కూటమి ప్రభుత్వంలో సీసీ రోడ్లుగా మారుతున్నాయన్న టీడీపీ నాయకులు
పల్లె రోడ్లకు పండగొచ్చింది
- మారుమూల అభివృద్ధే ధ్యేయంగా కోవూరు ఎమ్మెల్యే కృషి
- ఎన్నో ఏళ్లుగా ఉన్న మట్టి రోడ్లు, కూటమి ప్రభుత్వంలో సీసీ రోడ్లుగా మారుతున్నాయన్న టీడీపీ నాయకులు
మారుమూల గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృషి చేస్తున్నారని బుచ్చి మండలం నాగమంబాపురం టీడీపీ నాయకులు అన్నారు..ఈ మేరకు స్దానిక గిరిజన కాలనీలో ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించామన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దశాబ్దాలుగా మట్టిరోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడేవారనీ…గ్రామంలో మౌలిక సదుపాయాలు, కల్పించేలా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు..నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.. గ్రామ పార్టీ అధ్యక్షుడు ఒంటేరు గిరి యాదవ్, మాజీ ఉప సర్పంచ్ వెంకటరమణయ్య, గాలి వెంకటరమణయ్య ఉన్నారు..ఆదివారం ఓవైపు సెలవు, మరోవైపు పండుగదినం అయినప్పటికీ ఇంజనీరింగ్ అధికారి కృష్ణకుమారి ఎప్పటికప్పుడు పనలను పర్యవేక్షించారు..