ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
కుడితిపాళెంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
పది నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు…
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
- కుడితిపాళెంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
అధికారంలో వచ్చిన కేవలం పది నెలల్లోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని…ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కుడితిపాళెం పంచాయతీలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే విచ్చేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి చేతుల మీదుగా నూతనంగా నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ కు భూమి పూజ చేశారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ….కోవూరు నియోజకవర్గానికి రెండు సబ్ స్టేషన్లు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. కూటమిది మాటల ప్రభుత్వం కాదని…చేతల ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, మండల అధికారులు, ప్రజల తదితరులు పాల్గొన్నారు.