ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న విషయాన్ని మరచిపోవద్దు
బుచ్చిలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
వార్డు సమస్యలు కూడ పరిష్కరించుకోలేరా?
- ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న విషయాన్ని మరచిపోవద్దు
- బుచ్చిలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందనీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు.. ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయతి పరిధిలోని ఐదు, ఆరు,ఏడు వార్డులో ఆమె పర్యటించారు..ఈ సందర్భంగా స్ధానికులు రోడ్లు, డ్రెయినేజీలు, గుడపల్లి కాలువ పారిశుధ్యం తదితర సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.. దీనిపై ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు, నాయకులపై అసహనం వ్యక్తం చేశారు.. వార్టు సమస్యలు స్ధానిక ప్రజాప్రతినిధులు, నాయకులే పరిష్కరించుకోవాలనీ సూచించారు.. అన్నివేళలా ప్రజలకు నాయకులు అందుబాటులో ఉండాలని సమస్యలు తెలుసుకుని అధికారులు దృష్టి తీసుకెళ్లి సమయానుకూలంగా పరిష్కరించాలనీ ఆదేశించారు..పారిశుధ్యం సమస్యల రావడంతో కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు..అన్నీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తామనీ ఈ సందర్భంగా ప్రజలకు ప్రశాంతిరెడ్డి హామి ఇచ్చారు…