రాష్ట్ర మంత్రి పార్ధసారధి నెల్లూరులో సుడిగాలి పర్యటన
చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో ఫుడ్ పాయిజన్ అస్వస్థత గురైన విద్యార్థులు
రాజకీయ కక్షలు, అక్రమ కేసులతో కొత్త సంస్కృతికి తెర లేపిన కూటమి ప్రభుత్వం
ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి పథకంలో కోటి పది లక్షల పని దినాల కల్పనే లక్ష్యం
9 ఏళ్ల తర్వాత అట్టహాసంగా ప్రారంభమైన హజరత్ అమిర్ షావల్లి 74వ ఉరుసు
నెల్లూరులో మంత్రి పార్ధసారధి సుడిగాలి పర్యటన జరిపారు. అల్లీపురంలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసానికి ఆయన విచ్చేశారు. మంత్రికి, గృహ నిర్మాణశాఖ ఎండీ రాంబాబులకి సోమిరెడ్డి అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 11 మంది విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. వారందర్నీ హుటాహుటీన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెంటనే ఆసుపత్రికి వెళ్లి వారిని పరిశీలించారు. దీనిపై సమగ్రంగా విచారించాలని ఆదేశించారు.
పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి పార్ధసారథి హెచ్చరించారు. సర్వేపల్లిలో పర్యటించిన ఆయన ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాల్లో తమను మోసం చేశారని మంత్రి ఎదుట లబ్ధిదారులు తమ గోడును వెల్లబోసుకున్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. రాజకీయ కక్షలు, కేసులతో కొత్త సంస్కృతికి తెరలేపారంటూ ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఎమ్మెల్సీ మేరిగ నెల్లూరు డైకాస్రోడ్డులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా కోటి పది లక్షల పని దినాలు కల్పించడమే లక్ష్యమని డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం 17వ సామాజిక తనిఖీలు నిర్వహించారు. వచ్చ వారం లోపు అన్నీ మండలాల్లో సామాజిక తనిఖీలు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
నాయుడుపేటలో 9 ఏళ్ల తర్వాత హజరత్ అమిర్ షావల్లి 74వ ఉరుసు మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. భక్తులు విశేషంగా పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం భక్తులకి పకీర్లు గంధాన్ని పంచి పెట్టారు.
వింజమూరులోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థుల ప్రతిభను గుర్తించిన నాసా గుర్తించింది. ఆ విద్యార్థులు చేసిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు మొదటి బహుమతికి ఎంపికైనట్లు ఈ సందర్భంగా శ్రీచైతన్య జనరల్ మేనేజరు కొండారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 63 ప్రాజెక్టులను పంపించగా అందులో మొదటి బహుమతిగా వింజమూరు శ్రీ చైతన్య స్కూల్ ఉండడం.. ఈ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక వరంగా భావించవచ్చని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
నేరాల నియంత్రణపై సంగం ఎస్ఐ రాజేష్ ప్రత్యేక దృష్టి సారించారు. సర్కిల్ కార్యాలయం వద్ద ఆటో అనౌన్స్ మెంట్ ను ఆయన ప్రారంభించారు. వేసవిలో చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2023 డిసెంబర్ నెలలో మిఛాంగ్ తుఫాన్ నిధులు దుర్వినియోగయమయ్యాయని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి అన్నారు. జలదంకి మండలంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తుఫాన్ సమయంలో ఎలాంటి నిధులు వెచ్చించకుండానే బిల్లులు చేసుకున్నారని, దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు.
వేసవిలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని వాకాడు ఎస్ఐ నాగబాబు సూచించారు. తన కార్యాలయం వద్ద ఆయన వాహనదారులకి, ప్రజలకి ఎండ తీవ్రతపై అవగాహన కల్పించారు. ప్రజలకి, వృద్ధులకి ఎస్ఐ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
గూడూరులోని స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వార్షికోత్సవ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం కరస్పాండెంట్ నవకోటి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. విద్యార్థలు చూపిన ప్రతిభ, సాధించిన మార్కులు, వివిధ రంగాల్లో యాక్టివిటీస్, స్పోర్ట్స్ వంటి అంశాల్లో సాధించిన విజయాలకు గాను.. బహుమతులను అందజేశారు.
సంగం సీఐ వేమారెడ్డి కాసేపు టీచర్ గా మారారు. బుక్ చేత పట్టి విద్యార్థులకి ఇంగ్లీష్ గ్రామర్ ను బోధించారు. గ్రామర్ ఎలా రాయాలో విద్యార్థుల చేత రాయించి… పలు సూచనలు, సలహాలు తెలియజేశారు.
కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు కిట్లను అందజేశారు. ఫైలేరియా వ్యాధి ఎలా వ్యాపిస్తుంది.. ఏవిధంగా నిర్మూలించాలనే అంశాలను ఫైలేరియా జిల్లా అధికారిణి హుస్సేనమ్మ అవగాహన కల్పించారు.
సూళ్లూరుపేటలోని శ్రీ సీతారామ ఆలయంలో శ్రీరామ నవమి వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు శ్రీ పరశురామ అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.