నెల్లూరులో హుందా రాజ‌కీయాల్లేవ్‌

కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌కీయ క‌క్ష‌ల‌కు పాల్ప‌డుతోంది

కేసుల‌తో కొత్త సంస్కృతికి తెర‌లేపింది

కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డిపై అక్ర‌మంగా కేసులు

మీడియా స‌మావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ ముర‌ళీధ‌ర్‌

నెల్లూరులో హుందా రాజ‌కీయాల్లేవ్‌
-కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌కీయ క‌క్ష‌ల‌కు పాల్ప‌డుతోంది
-కేసుల‌తో కొత్త సంస్కృతికి తెర‌లేపింది
-కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డిపై అక్ర‌మంగా కేసులు

మీడియా స‌మావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ ముర‌ళీధ‌ర్‌

నెల్లూరు రాజ‌కీయాలు హుందాత‌నంగా.. ప్ర‌శాంతంగా ఉండేవ‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. రాజ‌కీయ క‌క్ష‌లు, కేసుల‌తో కొత్త సంస్కృతికి తెర‌లేపారంటూ.. ఎమ్మెల్సీ మేరిగ ముర‌ళీధ‌ర్ అన్నారు. ఈమేర‌కు ఆయ‌న శుక్ర‌వారం నెల్లూరు డైకాస్‌రోడ్డులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డిపై అక్ర‌మ కేసులు న‌మోదు చేస్తున్నార‌ని.. ఆయ‌న్నే టార్గెట్ చేసుకుని మ‌రీ వేధిస్తున్నారంటూ మండిప‌డ్డారు. కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తే.. కేసులు పెడ‌తారా అంటూ ఈసంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఇంకా అనేక విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *