కాటేపల్లిలో చెరువులను పరిశీలించిన ఆర్డీవో వంశీకృష్ణ
ఆక్రమణదారులకి కావలి ఆర్డీవో హెచ్చరిక
- కాటేపల్లిలో చెరువులను పరిశీలించిన ఆర్డీవో వంశీకృష్ణ
ఇటీవల కాలంలో చెరువుల అన్యాక్రాంత మవుతున్నాయని వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పీజీఆర్ఎస్ కింద ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్ ఆదేశాల మేరకు.. కావలి ఆర్డీవో వంశీకృష్ణ కాటేపల్లి గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి ఆక్రమణలకు గురైన చెరువులను పరిశీలించారు. అక్కడ పరిస్థితులను రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూలకు సంబంధించి…భూములు కానీ, చెరువులను కానీ ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి ఈ, రామకృష్ణ , దేస్ నాయక్,ఖాన్ రెవిన్యూ శాఖ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.