క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే… ప్రజాసమస్యలు తెలుస్తాయి
1వ డివిజన్లో ప్రారంభమైన గడప గడపకు కోటంరెడ్డి
గిరిధర్రెడ్డికి అడుగడుగునా ఘనస్వాగతం పలికిన కూటమి శ్రేణులు
శ్రీధరన్న మాటలే స్ఫూర్తి
క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే… ప్రజాసమస్యలు తెలుస్తాయి
- 1వ డివిజన్లో ప్రారంభమైన గడప గడపకు కోటంరెడ్డి
- గిరిధర్రెడ్డికి అడుగడుగునా ఘనస్వాగతం పలికిన కూటమి శ్రేణులు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం గురువారం 1వ డివిజన్ నారాయణ రెడ్డి పేట నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు భారీ గజమాలలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి, నుదుట తిలకం దిద్దారు. ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ కోటంరెడ్డి ముందుకు సాగారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకునేలా వారితో మమేకం కావడం సంతోషంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజల వాస్తవిక సమస్యలు తెలుస్తాయని నిత్యం చెప్పే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితోనే తాను గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కుడుముల చిరంజీవి గౌడ్, ఓట్టూరు సురేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.