రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్
విజయవాడలో అజీజ్ అధ్యక్షతన 3 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం
ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం
ముస్లింలకి అతి త్వరలో కొత్త పథకం…
- రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్ధుల్ అజీజ్
- విజయవాడలో అజీజ్ అధ్యక్షతన 3 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం
- ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం
విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 3 వ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండా లపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. పలు మ్యానేజింగ్ కమిటీలు, పలు ముతవల్లీలను నియమించారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ… ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని అతి త్వరలో దాని వివరాలు తెలియచేస్తామని అన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దె ల సవరణకు రెంట్ రివ్యూ కమిటీ ను నియమించామని తెలిపారు. సమావేశంలో శాసనమండలి సభ్యులు మొహమ్మద్ రుహుల్లా, శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్, ఖాజా, అక్రమ్, ఇస్మాయిల్ బేగ్, ఆఫియా, ముక్రం హుస్సేన్, దావూద్ భాషా బఖావి, బేపారి జాకీర్ అహమద్ సీఈఓ మొహమ్మద్ అలీ వక్ఫ్ అధికారులు పాల్గొన్నారు.