గంజాయి అమ్ముతుండగా పట్టుపడ్డ కానిస్టేబుల్
5 కిలోలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ శ్రీనివాస్
పోలీసే గంజాయి విక్రయదారుడు…
- గంజాయి అమ్ముతుండగా పట్టుపడ్డ కానిస్టేబుల్
- 5 కిలోలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
- మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ శ్రీనివాస్
యాంకర్ పార్ట్ :
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు గూడూరు రెండో పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల్లో ఒకరు సూళ్లూరుపేట జీఆర్పీ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అవినాష్ గా గుర్తించామన్నారు. నిందితుల వద్ద నుంచి ఐదు కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు.
తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి ఇద్ధరీ అరెస్ట్ కు సంభందించి వివరాలను గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. గాంధీనగర్ కు చెందిన సునీల్ శ్మశానం వద్ద గంజాయిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తెర వెనుక ఉన్న ఓ కానిస్టేబుల్ పాత్ర వెలుగు చూసింది. సూళ్లూరుపేట జిఆర్పి లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అవినాష్ అక్రమ గంజాయి వ్యాపారం బట్టబయలైంది. రాత్రి సమయంలో రైళ్లలో గంజాయి వినియోగిస్తున్న వాళ్లను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకునేవాడు. ఆ గంజాయిని సునీల్ అనే కమిషన్ ప్రాతిపదికన విక్రయించేలా ఒప్పందం కుధురుచుకొని కొద్ది రోజులుగా అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్నారు. సునీల్ ను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 5 కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు