అధికారులకే క్లారిటీ లేదు
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి
నేను భయపడే రకం కాదు…
- అధికారులకే క్లారిటీ లేదు
- వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన మైనింగ్ కేసుపై…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నేను అప్రూవర్ గా మారినట్లు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గే రకం నేను కాదని…ఎప్పటికీ అధినేత జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కాకాని మీద నమోదైన అక్రమ కేసులో నన్ను A1 గా చేర్చారన్నారు. రస్తుం మైన్స్ మీద మైనింగ్ అధికారులకే క్లారిటీ లేదన్నారు. ఓనర్ కూడా లేని మైన్స్ లో అక్రమాలు జరిగాయని మాపై కేసు పెట్టడం దారుణమన్నారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం…