వీఎస్యూ వైన్స్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు
న్యాక్లో B++ గ్రేడ్ సాధించిన కృష్ణచైతన్య విద్యార్థులు
టాపర్స్ కి గోల్డ్ మెడల్స్ అందచేత
సీపీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా కృష్ణచైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
అలరించిన విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు
17 ఏళ్లుగా ఎన్నో విజయాలు…
- వీఎస్యూ వైన్స్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు
- న్యాక్లో B++ గ్రేడ్ సాధించిన కృష్ణచైతన్య విద్యార్థులు
- టాపర్స్ కి గోల్డ్ మెడల్స్ అందచేత
- సీపీఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా కృష్ణచైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు
- అలరించిన విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు
కృష్ణ చైతన్య కళాశాల గత 17 ఏళ్లుగా దిన దినాభివృద్ధి చెందుతూ…న్యాక్ లో బి ప్లస్ ప్లస్ గ్రేడ్ సాధించడం గొప్ప విషయమని… వీఎస్యూ వైస్ చాన్సలర్ అల్లం శ్రీనివాసరావు కొనియాడారు. నెల్లూరు సీపీఆర్ కళ్యాణ మండపంలో… కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 17వ వార్షికోత్సవ సంబరాలు అంబరన్నాంటాయి. కార్యక్రమానికి విశిష్ఠ అతిధిగా వీఎస్యూ వైస్ చాన్సలర్ శ్రీనివాసరావు విచ్చేయగా.. ముఖ్య అతిధులుగా కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ఆర్వీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ రానా ప్రమోద్ రెడ్డిలు విచ్చేశారు. వీరికి కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకల్ని ప్రారంభించారు. విద్యార్థుల్ని ఉద్దేశించి వారు ప్రసంగించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉత్తమ ర్యాంకులు సాధించి భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అకడమిక్ టాపర్స్ కి బహుమతులు అందచేశారు. రావూరు కృష్ణమ్మ, రాపూరు దశరధరామిరెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్స్ ని.. యూనివర్శిటీ టాపర్స్ విద్యార్థులకి అందచేసి అభినందించారు. అనంతరం ముఖ్య అతిధుల్ని… భారీ గజమాలతో సత్కరించి పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ అల్లం శ్రీనివాసరావు, కృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో విద్యా సంస్థల డీన్ లు డీన్ ఆర్ వి ఎస్ ప్రసాద్, రామాంజి నేయులు రెడ్డి, జ్యోతి, సుధారాణి,రమేష్, ఏ ఓ హరి, ప్రిన్సిపాల్ ప్రసాద్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.