రాపూరులో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేసిన పీడీ నాగరాజకుమారి
పెన్షన్లు పంపిణీ చేసిన డీఆర్డీఏ పీడీ
- రాపూరులో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేసిన పీడీ నాగరాజకుమారి
జిల్లాలో ఎటువంటి అవినీతి అవకతవకలకు తావివ్వకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని నెల్లూరు జిల్లా డిఆర్డిఎ పిడి వి,నాగరాజకుమారి తెలిపారు. పెన్షన్ పంపిణీలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలలో సచివాలయ సిబ్బందితో కలసి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భవాని, ఏపీఎం రాధా, సచివాలయం అధికారులు పాల్గొన్నారు.