కమిషనర్ సూర్య తేజ
చిల్డ్రన్స్ పార్కులో మెరుగైన వసతులకు చర్యలు
- కమిషనర్ సూర్య తేజ
యాంకర్ పార్ట్ :
నెల్లూరు నగరంలో కమిషనర్ సుడిగాలి పర్యటన జరిపారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక చిల్డ్రన్స్ పార్కును ఆయన సందర్శించారు. పార్కుకు విచ్చేసే సందర్శకులకు అవసరమైన మరుగుదొడ్లు, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి క్రమం తప్పకుండా పరిశుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి కమిషనర్ సూచించారు.
వాయిస్ వోవర్ :
నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్కులో మరింత మెరుగైన వసతులను కల్పించి, పార్కును సందర్శించే వారికి పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ సూర్య తేజ తెలియజేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా జిమ్ పరికరాలు, షటిల్, ఇతర క్రీడా సౌకర్యాలను ప్రత్యేక ప్రాంగణంలో కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… పార్కులో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షించనున్నామని తెలిపారు. విధులలో అలసత్వం వహించిన సంభంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఈ.ఈ శేషగిరిరావు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.