క్రైస్తవ మతాన్ని బోధించకూడదా..?

సమాజంలో క్రైస్తవులపై పెరుగుతున్న దాడులు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక కుట్ర కోణం దాగి ఉంది

బుచ్చిరెడ్డిపాలెంలో క్రైస్తవ,ప్రజా సంఘాల ఆవేదన

క్రైస్తవ మతాన్ని భోధించకూడదా..?

  • సమాజంలో క్రైస్తవులపై పెరుగుతున్న దాడులు..
  • పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక కుట్ర కోణం దాగి ఉంది
  • బుచ్చిరెడ్డిపాలెంలో క్రైస్తవ,ప్రజా సంఘాల ఆవేదన

ఉభయ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ ప్రబోధకుడుగా సుపరిచితుడైన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అత్యంత బాధాకరమని క్రైస్తవ సంఘాలు,ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల స్థానిక అంబేద్కర్ భవనం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు మాట్లాడుతూ.. సమాజంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని చెప్పారు.. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కు ప్రకారం తాము తమ మతాన్ని స్వేచ్ఛగా బోధించుకుంటుంటే తమపై దాడులు చేయడం సరికాదని ధ్వజమెత్తారు.. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు..ప్రవీణ్‌ మరణం వెనుక కుట్ర కోణం దాగి ఉందని, పోలీసులు వాస్తవాలను వెలికితీయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *