కోదండ‌రాముడి ఆశీస్సులు అంద‌రిపై ఉండాలి

నారాయ‌ణ విద్యా సంస్థ‌ల జీఎం వేమిరెడ్డి

కోదండ‌రామ‌స్వామి ఆల‌య వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల ఆహ్వాన ప‌త్రిక‌ను ఆవిష్క‌రించిన వేమిరెడ్డి

కోదండ‌రాముడి ఆశీస్సులు అంద‌రిపై ఉండాలి…

  • నారాయ‌ణ విద్యా సంస్థ‌ల జీఎం వేమిరెడ్డి
  • కోదండ‌రామ‌స్వామి ఆల‌య వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల ఆహ్వాన ప‌త్రిక‌ను ఆవిష్క‌రించిన వేమిరెడ్డి

నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేట లో వేంచేసియున్న సీతా,లక్ష్మణ, భరత ,శత్రుజ్ఞ ,ఆంజనేయ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా నారాయ‌ణ విద్యా సంస్థ‌ల జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆల‌య నిర్వాహ‌కులు, అర్చ‌కులు, టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి ఆహ్వాన ప‌త్రిక‌ను ఆవిష్క‌రించారు. కోదండ రాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని వీబీఆర్ ఆకాంక్షించారు అనంతరం దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన భక్తుల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *