ముగిసిన తిరుప‌తి సీఎం ప‌ర్య‌ట‌న‌

రేణిగుంట విమానాశ్ర‌యం వ‌ద్ద ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి సాద‌ర వీడ్కోలు ముగిసిన తిరుప‌తి సీఎం ప‌ర్య‌ట‌న‌… రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రెండు రోజుల ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది. పర్యటన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుండి బేగంపేట విమానాశ్రయంకు తిరుగు పయనమైన సీఎం చంద్ర‌బాబుకి టీటీడీ ఈవో, డీఐజీ, జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీ, జేసీ, ఎమ్మెల్యేలు, క‌మిష‌న‌ర్‌, మేయ‌ర్‌, కార్పొరేష‌న్ చైర్మ‌న్‌, ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెస‌ర్‌, రిజిస్టర్ , రేణిగుంట తాసిల్దార్ , ప్రజాప్రతినిధులు,…

Read More

మెడిక‌ల్ షాపుల‌పై విజిలెన్స్ దాడులు

చిత్తూరులోని ప‌లు మెడిక‌ల్ షాపుల్లో అధికారుల ఆక‌స్మిక త‌నిఖీలు మెడిక‌ల్ షాపుల‌పై విజిలెన్స్ దాడులు ఆపరేషన్ గరుడలో భాగంగా చిత్తూరు ప‌ట్ట‌ణంలోని…మెడిక‌ల్ షాపుల‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్, కెమిస్ట్ డ్ర‌గిస్ట్ అధికారులు ఆక‌స్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో నిషేధిత మందులను డాక్టర్ రసీదు లేకుండా విక్రయిస్తున్న మెడికల్ షాపులను గుర్తించి, సంబంధిత షాప్‌ల‌లో విజిలెన్స్ అధికారి క‌రిముల్లా ష‌రీఫ్ ఆధ్వ‌ర్యంలో త‌నిఖీలు చేప‌ట్టారు. స్థానిక ముర‌కంబ‌ట్టు స‌మీపంలోని మెడిక‌ల్ షాపుల్లో డాక్ట‌ర్ల ర‌సీదులు, స‌రైన…

Read More

సూరా సమర్ధవంతుడు – వైజీఆర్ స్పష్టం

పార్టీ నేతలను సమన్వయం చేయడంలో హరికృష్ణ సామర్థ్యం సరిపోవడం లేదు మండలంలో తీవ్రంగా చర్చ నడుస్తున్న గోవర్ధన్ వ్యాఖ్యలు సూరా సమర్ధవంతుడు – వైజీఆర్ స్పష్టం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడు హరికృష్ణ.. ద్వితీయ శ్రేణి నాయకులను సమన్వయం చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నాడనీ..అతని సామర్థ్యం సరిపోదని ఆ పార్టీ నేత ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు..బుచ్చి మండలంలోని రేబాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..సూరా శ్రీనివాసులు రెడ్డి సమసర్ధవంతమైన నాయకుడని తెలిపారు..మండలంలో సూరాకు మంచి పట్టు ఉందని…

Read More

నాకు, రూప్ మధ్య గొడవ నిజమే

రాజకీయాలలో అంతర్గత విభేధాలు సర్వసాధారణం తరువాత మేము క్షమాపణలు చెప్పుకున్నాం రూప్ కుమార్ నాకు సహోదరుడు నా రాజకీయ ప్రయాణం ప్రశాంతిరెడ్డితోనే – మీడియాతో టీడీపీ నేత యర్రంరెడ్డి నాకు, రూప్ మధ్య గొడవ నిజమే గత నాలుగు రోజులుగా సింహపురి జిల్లాలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. పెన్నా డెల్టా మాజీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి చుట్టే రాజకీయ తిరిగింది..ఇటివల విజయవాడలో కోవూరు ఎమ్మెల్యే నివాసంలో ఇద్దరి మద్య నువ్వెంతంటే నువ్వెంత అనే స్ధాయిలో…

Read More

ఘనంగా ఏపీ టిడ్కో చైర్మన్ జన్మదిన వేడుకలు

కావలి పట్టణంలో జనసేన యువనాయకుడు సిద్దు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఎస్టీ కాలనీల్లో 300 కుటుంబాలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ ఘనంగా ఏపీ టిడ్కో చైర్మన్ జన్మదిన వేడుకలు కావలి పట్టణంలో పేదల మధ్యలో జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి, క్రమశిక్షణ సంఘం చైర్మన్, l నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలను జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కావలి నియోజకవర్గ జనసేన యువ నాయకుడు…

Read More

సోమిరెడ్డి సార్‌.. మీరే నాకు న్యాయం చేయాలి..

క‌క్ష‌పూరితంగానే న‌న్ను స‌స్పెండ్ చేశారు ఎలాంటి నోటీసు లేకుండానే స‌స్పెండ్ చేసిన ప్రిన్సిపాల్ ఎస్తేర‌మ్మ‌ టీపీగూడూరు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ గురుకుల పాఠ‌శాల పీఈటీ టీచ‌ర్ హేమ‌ల‌త సోమిరెడ్డి సార్‌…మీరే నాకు న్యాయం చేయాలి… నెల్లూరు జిల్లా తోట‌ప‌ల్లిగూడూరు మండ‌లంలోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ గురుకుల పాఠ‌శాల‌లో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా ప‌ని చేస్తోన్న త‌న‌ను ప్రిన్సిపాల్ ఎస్తేర‌మ్మ క‌క్ష‌పూరితంగానే స‌స్పెండ్ చేసింద‌ని…టీచ‌ర్ హేమ‌ల‌త ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు ఆమె త‌న త‌ల్లితో క‌లిసి…గురుకుల పాఠ‌శాల…

Read More

కమ‌లాక‌ర్‌ రెడ్డి పెత్తనం కట్ చేస్తాం

నా రాజకీయం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. నేను అనుకుంటే..రెండు నెలల్లో చక్రం తిప్పుతా మీడియాతో గోవర్ధన్ రెడ్డి.. కమ‌లాక‌ర్‌ రెడ్డి పెత్తనం కట్ చేస్తాం ఇకపై బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పక్క నియోజకవర్గాలకు చెందినటువంటి వ్యక్తుల పెత్తనం కొనసాగదని టీడీపీ నేత గోవర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు..మండల పార్టీ వ్యవహారాలలో కమలాకర్ రెడ్డి జోక్యం లేకుండా చేస్తామన్నారు..తన రాజకీయం ఏ విధంగా ఉంటుందో మండల ప్రజలందరికి స్పష్టంగా తెలుసన్నారు..అన్నీ పార్టీలలో తన అభిమానులు ఉన్నారనీ పిష్టేజికి…

Read More

వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా..

భ‌క్తుల‌కి స్వ‌యంగా అన్న‌ప్ర‌సాదాలు వ‌డ్డించిన సీఎం సీఎం మ‌నవ‌డు నారా దేవాన్ష్ పుట్టిన సంద‌ర్భంగా టీటీడీ అన్న‌ప్ర‌సాదానికి రూ. 44 ల‌క్ష‌ల విరాళం తిరుమ‌ల‌లోని దేవ‌దేవుడిని ద‌ర్శించుకున్న సీఎం చంద్ర‌బాబు, కుటుంబ స‌భ్యులు వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు సీఎం త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి…

Read More

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌పై ప్ర‌భుత్వ స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి

సూళ్లూరుపేట అఖిల భార‌త విద్యార్థి ఫెడ‌రేష‌న్ డిమాండ్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌పై ప్ర‌భుత్వ స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ BR అంబెడ్కర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడటం పై విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ వారు డిమాండు చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో AISF నియోజవర్గం కార్యదర్శి సూర్య, SFI…

Read More

అయ్యా మంత్రి గారు.. దోమ‌ల నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడండి

న‌గ‌రంలో అధ్వానంగా పారిశుధ్యం – కొళాయిల్లో క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా సీపీఎం నెల్లూరు న‌గ‌ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ బాలాజీన‌గ‌ర్ స‌చివాల‌యం ఎదుట ధ‌ర్నా అయ్యా మంత్రి గారు…దోమ‌ల నుంచి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడండి నెల్లూరు నగరంలో దోమలు, పారిశుద్యం, డ్రైనేజీ, కొళాయిల్లో కలుషిత నీరు సరఫరా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ…సీపీఎం నెల్లూరు న‌గ‌ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టింది. న‌గ‌రంలోని సీపీఎం కార్యాల‌యం నుంచి స్థానిక స‌చివాల‌యం వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌గా వెళ్లి…అనంత‌రం…

Read More