కావలి పట్టణంలో రంజాన్ వేడుకులకు సర్వం సిద్ధం చేసిన ముస్లిం సోదరులు
రంజాన్ వేడుకులకు సర్వం సిద్ధం
కావలి పట్టణంలో రంజాన్ వేడుకులకు సర్వం సిద్ధం చేసిన ముస్లిం సోదరులు
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో సోమవారం రంజాన్ పండుగ నిర్వహించేందుకు ముస్లిం సోదరులు సర్వం సిద్ధం చేశారు. పట్టణంలో రైల్వే రోడ్డు, ఉత్తరంపేట, ఇస్లాంపేట, కసాయి వీధి, వైకుంఠపురం, ఇందిరానగర్ లోని మసీదుల్లో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఇక్కడ ప్రార్థనలు జరిగే సమయాలను ముస్లిం పెద్దలు ప్రకటించారు. ఇక్కడ ప్రార్థనలు నిర్వహించేందుకు వీలుగా మసీదు పెద్దలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ముక్తి ఖలీల్ అహ్మద్ రంజాన్ ఆవశ్యకతను వివరించారు