రోజు రోజుకూ ఉత్కంఠ -నేడు నోటీసులు జారీ చేసిన పోలీసులు
రేపు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు
వైసీపీ శ్రేణుల్లో ఆందోళన
కాకాణి అరెస్టు తప్పదా..?
-రోజు రోజుకూ ఉత్కంఠ
-నేడు నోటీసులు జారీ చేసిన పోలీసులు
-రేపు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు
-వైసీపీ శ్రేణుల్లో ఆందోళన
మాజీ మంత్రి, జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తున్నారంటూ కూడా గత వారం రోజులుగా ఉన్న ఉత్కంఠకు ఒకరకంగా నేడు తెరపడింది. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారంటున్నారు. ఇటీవలే కాకాణిపై పొదలకూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై ముందస్తు బెయిల్కు వెళ్లినా.. కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అప్పటి నుంచి ఏ క్షణమైనా గోవర్థన్రెడ్డి అరెస్టు తప్పదంటూ ప్రచారం జరిగింది. అయితే.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం జరగదన్న వాదన కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో అంతా అనుకుంటున్నట్లే.. ఆయనకు నోటీసులు అందించేందుకు ఆదివారం సాయంత్రం పొదలకూరు పోలీసులు నెల్లూరు డైకాస్ రోడ్డులోని కాకాణి నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఆయన అందుబాటులో లేకపోవడంతోపాటు.. ఇంటి గేట్లకూ తాళాలు వేసి ఉండడంతో.. కాకాణి నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు. ఈవిషయం తెలియడంతో వైసీపీ నాయకులు, శ్రేణులు, కాకాణి అనుచరులు అక్కడకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రుస్తుం మైన్స్ వ్యవహారంలో నమోదైన కేసులో ఆయన్ను విచారించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు జారీ చేసేందుకు వచ్చినట్లు ఈసందర్భంగా పొదలకూరు ఎస్సై శివరామ కృష్ణారెడ్డి మీడియాకు తెలిపారు. అయితే.. నోటీసులు జారీ చేసినట్లు.. కాకాణి విచారణకు హాజరవుతారా..? లేదా..? అనే దానిపైనా ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ హాజరైతే మాత్రం అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా గత వారం.. పది రోజులుగా ఈవిషయం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది