ఉగాది సంబ‌రాల్లో మంత్రి నారాయ‌ణ‌ దంప‌తులు

రంగ‌నాథ‌స్వామి, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించి త‌రించిన పొంగూరు

విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని… రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రమాదేవి దంపతులు రంగ‌నాయ‌కుల‌పేట‌లోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం కమిటీ నిర్వాహకులు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ మంత్రి నారాయణ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చక స్వాములు తీర్థప్రసాద వినియోగాలు అందజేసి మంత్రి దంపతులకు పేద ఆశీర్వచనం అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. 2014- 19లో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆలయ పూజారులు భక్తుల విన్నపం మేరకు రంగనాయక స్వామి పెన్నగాట్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఘాట్ ను విస్తరించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *