పాస్టర్ పగడాల ప్రవీణ్ది ముమ్మాటికి హత్యే
నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్
వెంకటగిరిలో క్రైస్తవులు నిరసన సభ…
- పాస్టర్ పగడాల ప్రవీణ్ది ముమ్మాటికి హత్యే
- నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఫాస్టర్ పగడాల ప్రవీణ్ మరణాన్ని తీవ్రంగా ఖండిస్తూ… యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్, బహుజన మైనార్టీ ఫెడరేషన్ అండ్ ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో…వెంకటగిరిలో నిరసన సభ నిర్వహించారు. ప్రవీణ్ హత్యకు కారకులైన నిందితుల్ని పోలీసులు కఠినంగా శిక్షించాలని…ఆయన కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున చేశారు. పాస్టర్ ప్రవీణ్ది ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. ప్రవీణ్ హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని…వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హత్యకు కారకులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా… అఖిలభారత అంబేద్కర్ రాష్ట్ర కార్యదర్శి, చింతమాకుల పుణ్యమూర్తి, వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్, ఎన్ పాల్ మనోహర్, కల్లూరు జాన్ మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర కార్యదర్శి తదితరులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు, క్రైస్తవులు పాల్గొన్నారు.