అవినీతి పత్రిక, ఛానల్ సాక్షిలో విషపు రాతలు
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై అసత్య కథనాలు ఎవరూ నమ్మరు
కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు అసలే నమ్మరు
కావలి జనసేన యువ నాయకుడు సిద్దు సంచలన వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్యేకి సిగ్గుందా…!
-అవినీతి పత్రిక, ఛానల్ సాక్షిలో విషపు రాతలు
-కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై అసత్య కథనాలు
ఎవరూ నమ్మరు.
-కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు అసలే నమ్మరు.
-కావలి జనసేన యువ నాయకుడు సిద్దు సంచలన వ్యాఖ్యలు.
అవినీతి పునాదులమీద నిర్మించిన సాక్షి ఛానల్, పత్రికలో వచ్చే కథనాలను ఎవరూ నమ్మరని.. ఈ నిజం కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలని
కావలి జనసేన యువ నాయకుడు సిద్దు తెలిపారు.
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పై సాక్షిలో వస్తున్న కథనాలపై సిద్దు ఫైర్ అయ్యారు. గ్రావెల్ కొండలకు గుండు కొట్టిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు.. కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు కావలిలో గ్రావెల్ దోపిడీపై 90 శాతం మీడియా నిజాయితీగా వార్తా కథనాలు ప్రచురించిందన్నారు. కానీ తన అవినీతి మరకులను ప్రతాప్ కుమార్ రెడ్డి.. కావ్య కృష్ణారెడ్డికి అంటించేందుకు దిక్కుమాలిన సాక్షి ఛానల్ పత్రికలో అసత్య కథనాలు రాయిస్తున్నట్లు మండిపడ్డారు. కావలి ఎమ్మెల్యేగా విజయాన్నీ అందించిన కావలి ప్రజలకు ఏవిధంగా కృతజ్ఞతలు తెలిపాలని నిరంతరం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. నేడు మీడియా వందశాతం కావలి ఎమ్మెల్యే అభివృద్ధిపైనే చూపిస్తున్నట్లు తెలిపారు. ఇది తట్టుకోలేని మాజీ ఎమ్మెల్యే సిగ్గులేకుండా విషపు రాతలు రాయిస్తున్నట్లు చెప్పారు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రావెల్ దోపిడీ, బెట్టింగ్, గంజాయి అమ్మకాలు చేయించింది వాస్తవం కాదా, అధికారుల బదిలీకి, నియామకాలకు కమీషన్లు వసూలు చేయలేదా..? వీటిని ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతునొక్కలేదా అని ప్రశ్నించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కమీషన్లు తీసుకునే స్థాయికి దిగజారలేదన్నారు. ఇందుకు ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.