పెన్నాన‌ది వ‌ద్ద ఏపీ టూరిజం ఏర్పాటు

స్థలాన్ని ప‌రిశీలించిన ఏపీ టూరిజం అధికారులు, స్థానిక నాయ‌కులు

పెన్నాన‌ది వ‌ద్ద ఏపీ టూరిజం ఏర్పాటు…

  • స్థలాన్ని ప‌రిశీలించిన ఏపీ టూరిజం అధికారులు, స్థానిక నాయ‌కులు

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం పెన్నా నది పోర్లుకట్ట వద్ద ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనల మేరకు… జిల్లా ఏపీ టూరిజం అధికారులు, పోతిరెడ్డి పాలెం నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఎంపీటీసీ నాగరాజులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. పోతిరెడ్డి పాలెం పెన్నా కట్ట వద్ద టూరిజం పార్క్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించి అధికారులతో నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి మాట్లాడుతూ…పెన్నానది వద్ద ఏపీ టూరిజం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని ఎంపీ ప్రభాకర్ రెడ్డిని కోరామ‌న్నారు. స్పందించిన ఎంపీ ఎమ్మెల్యే టూరిజం ఏర్పాటుకు స్థల పరిశీలన చేయమని అధికారులకు సూచించార‌ని తెలిపారు. ఈ ప్రాంతంలో టూరిజం కింద బోట్ షికారు రిసార్ట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *