స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు జస్టిస్ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు
పెంచలకోన క్షేత్రాన్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
- స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు జస్టిస్ శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాస రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో హైకోర్టు జడ్జికి స్వాగతం పలికారు. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లకు, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు, మంత్రోచ్ఛారణాలతో ఆశీర్వాదం స్వీకరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు లాయర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, రాజేష్ పాల్గొన్నారు.