ఘనంగా ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు

కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్న టీడీపీ నేత‌లు

ఎన్టీఆర్‌కు ఎన్టీఆరే సాటి…

  • తెలుగు ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ
  • రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
  • ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో టీడీపీ జెండాను ఆవిష్క‌రించిన ప్ర‌జాప్ర‌తినిధులు
  • నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాల‌యంలో ఘ‌నంగా 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు
  • పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేత‌లు

రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంక్షేమ పథకాల ఆరాధ్యుడు నందమూరి తారకరామారావు అని… రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ కొనియాడారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలో… తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ‌, ఎమ్మెల్సీ బీద ర‌విచంద్ర‌, రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ అబ్ధుల్ అజీజ్‌, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, టీడీపీ ముఖ్య నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో టీడీపీ జెండాను ఆవిష్క‌రించారు. 43వ‌ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని… 43 కేజీల కేక్ క‌ట్‌ని ప్ర‌జా ప్ర‌తినిధులు క‌ట్ చేసి అంద‌రికి పంచి పెట్టారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు, స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు విగ్ర‌హానికి వారు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. 43 ఏళ్ల పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం గురించి ముఖ్య నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌కి వివ‌రించారు. అనంత‌రం మంత్రి నారాయ‌ణ‌, వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ అబ్ధుల్ అజీజ్‌లు మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లంటూ 1982 మార్చి 29 తేదీన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. త్వ‌రలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని వారు హామీ ఇచ్చారు. తెలుగు త‌మ్ముళ్లు, మ‌హిళా నాయ‌కురాళ్ల‌తో టీడీపీ కార్యాల‌యంలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *