జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులకి ఇఫ్తార్ విందు
హాజరైన ఆనం, నారాయణ, కోటంరెడ్డి, అజీజ్, శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్, కమిషనర్
ఘనంగా ఇఫ్తార్ విందు
- జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులకి ఇఫ్తార్ విందు
- హాజరైన ఆనం, నారాయణ, కోటంరెడ్డి, అజీజ్, శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్, కమిషనర్
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని… జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో … నెల్లూరు నగరం కస్తూరిదేవి గార్డెన్స్ లో…ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, టీడీపీ ముఖ్య నేతలు, ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
అనంతరం మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్లు మీడియాతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు టిడిపి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పథకాలు తీసుకొచ్చారన్నారు.