నగరం మసీదుల్లోని ఇమాంలు, మౌజాన్లకు రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
ప్రతి మసీదుకు వెళ్లి రంజాన్ తోఫా అందజేస్తా
-నగరం మసీదుల్లోని ఇమాంలు, మౌజాన్లకు రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
పవిత్రమైన రంజాన్ మాసంలో.. ముస్లీం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే.. రంజాన్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్సీ, నగర వైసీసీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కోరారు. అలాగే.. రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ఇమాంలు, మౌజాన్లకు నగరంలోని ప్రతి మసీదుకు వెళ్లి.. రంజాన్తోఫాను స్వయంగా అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈమేరకు గురువారం రాంజీనగర్లోని సిటీ వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ మైనారిటీ నాయకులతో కలసి.. ఇమాంలు, మౌజాన్లకు రంజాన్ తోఫా అందజేసి.. ముందస్తు రంజాన్ శుభాకాంక్షులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని.. రంజాన్ మాసంలో ముస్లీం సోదరులు ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలు చేపట్టి.. భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థించడం జరుగుతుందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రతి ఎస్సీ, ఎస్టీ బీసీ,మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.