బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చిన ముత్యాలమ్మ
జన సంద్రంగా ముత్యాలమ్మ జాతర -రుపు అమ్మవారి వెళ్లనంపుతో జాతర ముగింపు
జన జాతర..
ముత్యాలమ్మ జాతర
-బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చిన ముత్యాలమ్మ
-జన సంద్రంగా ముత్యాలమ్మ జాతర
-రుపు అమ్మవారి వెళ్లనంపుతో జాతర ముగింపు
ఉమ్మడి నెల్లూరు జిల్లా… గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో మూడవ రోజు గురువారం.. జనం పోటెత్తారు. జాతరలో చివరి రోజు కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది జనం.. భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. అమ్మవారు బంగారు చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే.. వైభవంగా యారా శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవం కన్నుల పండువగా జరిగింది. చివరి రోజు జనాలు పోటెత్తడంతో.. ట్రాఫిక్ నియంత్రణ కొంత ఇబ్బందిగా మారింది. అయినా.. గూడూరు డీఎస్పీ ఆదేశాలతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి.. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. రేపు ఉదయం అమ్మవారు వెళ్లనంపుతో ఈ జాతర ముగియనుంది.