అశ్వ‌రావుపేట‌లో అక్ర‌మంగా ఇసుక త‌ర‌లింపు

ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వాహ‌నాల‌ను స్టేష‌న్‌కు త‌ర‌లింపు

అశ్వ‌రావుపేట‌లో అక్ర‌మంగా ఇసుక త‌ర‌లింపు…

  • ముఠాని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వాహ‌నాల‌ను స్టేష‌న్‌కు త‌ర‌లింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం అచ్చుతాపురం, నారావారి గూడెం మధ్యలో ఉన్న చెరువు నుంచి అర్ధ‌రాత్రి అక్ర‌మంగా ఇసుక‌ను కొంద‌రు అక్ర‌మార్కులు త‌ర‌లించేస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. అర్ధ‌రాత్రి పూట అక్ర‌మంగా ఇసుక త‌ర‌లింపు ఏంట‌ని వారిని పోలీసులు ప్ర‌శ్నించారు. వారు స‌రైన స‌మాధానాలు లేక‌పోవ‌డంతో… ముఠాను అదుపులోకి తీసుకోవ‌డంతోపాటు…ట్రాక్ట‌ర్ల‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఇసుక అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని అధికారులు ఎన్ని సార్లు హెచ్చ‌రించినా…అక్ర‌మార్కుల్లో మార్పు రాక‌పోవ‌డంపై పోలీసులు సీరియ‌స్ అవుతున్నారు. అక్ర‌మార్కుల‌పై త్వ‌ర‌లోనే చ‌ట్ట‌ప‌ర‌మైన తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *