మేము ప్రారంభిస్తే…అది పూర్త‌వ్వాల్సిందే

టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి

రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం 30,31 డివిజ‌న్లో అభివృద్ధి

కార్య‌క్ర‌మాల్ని ప్రారంభించిన గిరిధ‌ర్‌రెడ్డి

మేము ప్రారంభిస్తే…అది పూర్త‌వ్వాల్సిందే

  • టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి
  • రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం 30,31 డివిజ‌న్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని ప్రారంభించిన గిరిధ‌ర్‌రెడ్డి

మేము ఏం అభివృద్ధి ప‌నులు ప్రారంభించినా…అవి పూర్వ‌వాల్సిందేన‌ని…టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30, 31వ డివిజన్ లలో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా గిరిధ‌ర్‌రెడ్డి విచ్చేశారు. ముందుగా ఆయ‌న‌కి స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా కోటంరెడ్డి స్థానిక ప్రజలతో కలసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంత‌రం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ….కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూరల్ లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయ‌న్నారు. వీలైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తిచేసి, ప్రజలకు అందిస్తామ‌ని గిరిధ‌ర్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *