జగ‌దేవిపేట‌లో చోరీ

బీరువాలో న‌గ‌దు, బంగారం, డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

జగ‌దేవిపేట‌లో చోరీ

  • బీరువాలో న‌గ‌దు, బంగారం, డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట పరిధిలోని మిక్సిడ్ కాలనీ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర రావు అనే వ్యక్తి ఇంట్లో గత రాత్రి చోరీ జరిగింది. బాధితుడు వివరాలు మేరకు… గతంలో కూడా ఇదే విధంగా తమ ఇంట్లో చోరీ జరిగినట్టు ఆరోపించారు. చంద్రశేఖర్ ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తూ ఉంటాడు. గత రాత్రి కుటుంబం సభ్యులు ఎవరూ లేని సమయంలో ఇంట్లో బీరువాను పగలగొట్టి, మరోసారి చోరీ చేసి నగదు, బంగారు చోరీ జరిగినట్టుగా తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులు తగిన న్యాయం చేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంత‌రం చంద్ర‌శేఖ‌ర్ మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *