కావలి మండలం ఆర్.సి. పాలెంలో అక్రమ లేవుట్ తొలగింపు
198/2 సర్వెనంబర్ 3.60 ఎకరాల్లో లే అవుట్ నిర్మాణం, శివాయిభూమి కలుపుకున్నట్లు ఆరోపణలు
లే అవుట్ లో ప్లాట్ల రాళ్లను దగ్గరుండి తొలగింపు చర్యలు తీసుకున్న కావలి ఎంపిడిఓ శ్రీదేవి
అక్రమ లేఅవుట్ పై ఎంపీడీవో కొరఢా
- కావలి మండలం ఆర్.సి. పాలెంలో అక్రమ లేవుట్ తొలగింపు
- 198/2 సర్వెనంబర్ 3.60 ఎకరాల్లో లే అవుట్ నిర్మాణం, శివాయిభూమి కలుపుకున్నట్లు ఆరోపణలు
- లే అవుట్ లో ప్లాట్ల రాళ్లను దగ్గరుండి తొలగింపు చర్యలు తీసుకున్న కావలి ఎంపిడిఓ శ్రీదేవి
కావలి మండలం ఆర్.సి. పాలెం పంచాయతీలో వేసిన లేవుట్ అనాధికారికంగా వేసినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం కావలి ఎంపిడిఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, సిబ్బంది లే అవుట్ లో ప్లాట్లకు వేసిన సర్వేరాళ్ళను తొలగించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ… ఆర్.సి. పాలెం గ్రామంలోని 198/2 సర్వెనంబర్ లో 3.60 ఎకరాల్లో అక్రమంగా లే అవుట్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా కొంత శివాయి భూమిని కలుపుకున్నట్లు పిర్యాదులు అందాయన్నారు. లే అవుట్ వేసిన యజమాని గుర్రం ప్రవీణ్ కుమార్ కు పలుమార్లు లే అవుట్ అనుమతులకు సంబంధించిన ఆధారాలను చూపించాలని కోరామన్నారు. నోటీసులు కూడా ఇచ్చామన్నారు. అయినా ఎలాంటి రిప్లై ఇవ్వలేదన్నారు. ఈ లేఔట్ లో ఎవరు ప్లాట్లు కొనవద్దని బోర్డు కూడా పెడతామని సూచించారు.